Parliament security breach | ఢిల్లీలోని భారత పార్లమెంట్లో భారీ భద్రతాలోపం (security breach) బయటపడిన విషయం తెలిసిందే. బుధవారం శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జీరో అవర్లో ఇద్దరు ఆగంతకులు లోక్సభ (Lok Sabha)లోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. కలర్ స్మోక్ వదిలి ఎంపీలను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పార్లమెంట్ ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలో భద్రతా ఉల్లంఘన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు.
పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కారణం నిరుద్యోగమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ‘ఇలా ఎందుకు జరిగింది? దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం. ప్రధాని మోదీ విధానాల వల్ల దేశంలోని యువతకు ఉపాధి లభించడం లేదు. ఈ కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు.
#WATCH | On Parliament security breach incident, Congress MP Rahul Gandhi says, “Why did this happen? The main issue in the country is unemployment. Due to the policies of PM Modi, the youth of the country are not getting employment and the reason behind (this incident) is… pic.twitter.com/iVNrp6xtpv
— ANI (@ANI) December 16, 2023
Also Read..
Shivraj Singh Chouhan| యువకుడి ప్రాణాలు కాపాడి.. మానవత్వం చాటుకున్న శివరాజ్సింగ్ చౌహాన్
Malta Vessel: మాల్టా నౌక హైజాక్.. రెస్క్యూ ఆపరేషన్లో భారతీయ నేవీ
Assembly Session | ప్యానల్ స్పీకర్లుగా ప్రకాశ్రెడ్డి, బాలూ నాయక్..