న్యూఢిల్లీ: మాల్టా(Malta Vessel) దేశానికి చెందిన ఎంవీ రుయిన్ నౌకను అరేబియా సముద్రంలో హైజాక్ చేశారు. ఆ నౌక ఇచ్చిన మేడే కాల్ ఆధారంగా భారతీయ నౌకాదళం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. హైజాక్కు గురైన మాల్టా నౌకను ట్రాక్ చేస్తున్నట్లు ఇండియన్ నేవీ చెప్పింది. ఎంవీ రుయిన్ నౌకలో మొత్తం 18 మంది సిబ్బంది ఉన్నారు. యూకే మ్యారీటైమ్ ఆపరేషన్స్ పోర్టల్లో.. ఆ నౌక హైజాక్ సమాచారాన్ని చేరవేసింది.
గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఉన్న భారతీయ యాంటీ పైరసీ ప్రెటోలింగ్ యుద్ధ నౌకలు తక్షణమే రంగంలోకి దిగాయి.శనివారం తెల్లవారుజామున ఎంవీ రుయిన్ నౌక కదలికలను గుర్తించినట్లు భారతీయ రక్షణ శాఖ తెలిపింది. ఎంవీ రుయిన్ నౌక హైజాక్ అయిన ప్రాంతంలో భారతీయ నౌకాదళానికి చెందని విమానం నిఘా చేపట్టింది. ఇతర ఏజెన్సీల సహకారంతో ఆ నౌక కదలికల్ని గమనిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సొమాలియా దిశగా ఆ నౌక వెళ్తున్నట్లు గురించారు. ఎంవీ రుయిన్ నౌక ఇచ్చిన మేడే పిలుపునకు భారతీయ నేవీ ముందుగా స్పందించింది.