Heavy Rains | ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కేరళ (Kerala), తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains ) ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (India Meteorological Department) తాజాగా వెల్లడించింది. ఈ మేరకు హెచ్చరికలు చేసింది. రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange alert) జారీ చేసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
నేడు (బుధవారం), రేపు (గురువారం) కేరళలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) అంచనా వేసింది. ఇక తమిళనాడు, పుదుచ్చేరిలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. వాతావరణ విభాగం హెచ్చరికలతో కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.
మరోవైపు తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో అడపాదడపా వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైకల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. మరోవైపు కేరళలో ఇప్పటికే గణనీయమైన వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.
Also Read..
Akhilesh Yadav | అలాజరిగుంటే టీమ్ఇండియా ప్రపంచకప్ గెలిచేది : అఖిలేశ్ యాదవ్
Uttarakashi Tunnel | క్షేమంగానే ‘సొరంగ’ బాధితులు.. వీడియో కాల్స్ మాట్లాడిన కుటుంబ సభ్యులు..!
Vaishnav Tej | నేను హీరోను కాదు.. నటుణ్ని మాత్రమే.. మెగా మేనల్లుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్