Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తిరిగి పార్లమెంట్ లో
అడుగుపెట్టనున్నారు. ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్ సభ (Lok Sabha) సచివాలయం
సోమవారం ప్రకటించింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Parliament Monsoon Sessions) రాహుల్ పాల్గొననున్నారు.
గతంలో మోదీ ఇంటి పేరు (Modi surname remark)పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) గత వారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గుజరాత్లోని సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. అలాగే వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు వీలు కల్పించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాహుల్ సభ్యత్వాన్ని దిగువ సభ (Lower House) పునరుద్ధరించింది. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏం జరిగిందంటే..?
కాగా, 2019 ఏప్రిల్ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దొంగలందరికీ మోదీ అనే
సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది?’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్కు చెందిన బీజేపీ
ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దీనిపై సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం
దావా వేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి
రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఆ మరునాడు ఆయనపై అనర్హత వేటు
వేశారు.
మరోవైపు జైలు శిక్షపై స్టే కోసం రాహుల్ గాంధీ ట్రయల్ కోర్టుతోపాటు గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు.
ఫలితం లేకపోవడంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం
ఊరట ఇచ్చింది. రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షపై స్టే విధించడంతోపాటు ఎంపీ హోదాను
పునరుద్ధరించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుతో రాహుల్ తాజాగా తన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పొందగలిగారు.
Also Read..
Bus Accident | ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృతి
PM Modi | నెరవేరని హామీ.. యూపీలో పశువుల పేరుతో ఓట్లు దండుకొన్న మోదీ
CM KCR | ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం గద్దర్ పేరు నిలిచిపోతుంది: సీఎం కేసీఆర్