ముంబై: మీడియా ఐకాన్గా చెప్పుకునే 9X మీడియా మేనేజింగ్ డైరెక్టర్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ మాజీ ప్రెసిడెంట్ ప్రదీప్ గుహా (Pradeep Guha) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో పోరాడుతున్నారు. 60 ఏండ్ల వయసులో ఉన్న గుహాను శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్ అంబానీ దవాఖానలో చేర్చి వెంటిలేటర్పై ఉంచారు. ఆయనకు భార్య పాపియా గుహా, కుమారుడు సంకేత్ ఉన్నారు. ఆయన మరణవార్తను కుటుంబసభ్యులు మీడియాకు విడుదల చేశారు.
టైమ్స్ గ్రూప్లో దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రదీప్ గుహా సేవలందించారు. గ్రూప్ వైస్ ఛైర్మన్ సమీర్ జైన్ నాయకత్వంలో 1980 ల చివరి నుంచి బీసీసీఎల్ అభివృద్దిలో కీలకంగా వ్యవహరించారు. టైమ్స్ రెస్పాన్స్ టీమ్ని రూపొందించడంలో గుహా అందించిన సహకారం భారతదేశంలోని మీడియా, వినోద పరిశ్రమ డైనమిక్స్ని మార్చిందని చెప్పవచ్చు.
‘కళాకారులు, రచయితలు, మీడియా నిర్వాహకులకు మార్గదర్శకుడిగా, ప్రకటనల దిగ్గజం’ గా ఆస్ట్రేలియా బేస్డ్ మీడియా టెక్ ఎంటర్ప్రెన్యూర్ చార్ల్టన్ డిసిల్వా గుర్తు చేసుకున్నారు. మీడియా అమ్మకాలను ఆకర్శణీయంగా చేసిన ఘనత ప్రదీప్ గుహాకే దక్కుతుందన్నారు.
హాల్మార్క్కు వ్యతిరేకంగా 23 న సింబాలిక్ సమ్మె
రక్షాబంధన్ రోజున ఆరోగ్య రక్ష.. ఇలా ట్రై చేయండి..!
మన సంస్కృతి, వారసత్వం గురించి యువత తెలుసుకోవాలి: వెంకయ్యనాయుడు
ఆఫ్ఘాన్లో క్రికెట్ భవితవ్యం ఏంటి..?
మంటలతో విన్యాసాలు.. కరాటే కోచ్ మృతి
ఆస్ట్రేలియాలో లాక్డౌన్ పొడగింపు
యోగిపై పోటీకి సిద్ధమైన ఐపీఎస్కు గృహనిర్బంధం
110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్ దొంగతనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..