న్యూఢిల్లీ : బంగారు ఆభరణాలకు తప్పనిసరిగా హాల్ మార్కింగ్ వేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా (Hallmark protest) బంగారు వర్తకులు గళం విప్పుతున్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 23 న ఒకరోజు సమ్మె పాటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆలిండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) ప్రకటించింది. వీరు తీసుకున్న నిర్ణయానికి రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు సంబంధించిన నాలుగు జోనలోని 350 సంఘాలు, సమాఖ్యలు వీరి మద్దతు తెలిపాయి.
బంగారం స్వచ్ఛతకు గుర్తింపుగాహాల్మార్కింగ్ అమలు చేయాలని బులియన్ వ్యాపారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాంతో, నకిలీ బంగారు ఆభరణాల అమ్మకాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 16 న హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున తక్షణమే నిర్ణయంలో మార్పు చేయాలని జీజేసీ డిమాండ్ చేస్తున్నది. హాల్మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఏకపక్ష అమలుకు వ్యతిరేకంగా ఒకరోజు శాంతియుత నిరసన, సింబాలిక్ సమ్మె చేపడుతున్నట్లు జీజేసీ మాజీ చైర్మన్ అశోక్ మీనావాలా తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీలో స్వర్ణకారుల ప్రతినిధి, దానభాయ్ జ్యువెలర్స్ గ్రూప్ డైరెక్టర్గా బంగారం స్వచ్ఛతకు గుర్తింపుగా
హాల్మార్కింగ్ అమలు చేయాలని బులియన్ వ్యాపారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీనావాలా ఉన్నారు. హాల్మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో బంగారం స్వచ్ఛతకు ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం హాల్మార్కింగ్ పొందడానికి 5-10 రోజుల సమయం పడుతున్నందున వ్యాపారం కోల్పోవాల్సి వస్తుందని పలువురు స్వర్ణ వ్యాపారులు వాపోయారు.
రక్షాబంధన్ రోజున ఆరోగ్య రక్ష.. ఇలా ట్రై చేయండి..!
మన సంస్కృతి, వారసత్వం గురించి యువత తెలుసుకోవాలి: వెంకయ్యనాయుడు
ఆఫ్ఘాన్లో క్రికెట్ భవితవ్యం ఏంటి..?
మంటలతో విన్యాసాలు.. కరాటే కోచ్ మృతి
ఆస్ట్రేలియాలో లాక్డౌన్ పొడగింపు
యోగిపై పోటీకి సిద్ధమైన ఐపీఎస్కు గృహనిర్బంధం
110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్ దొంగతనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..