కాన్బెర్రా : ఆస్ట్రేలియాలో మరోసారి కరోనా వైరస్ (Carona @ Australia) భయపెడుతున్నది. గత రెండు, మూడు రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. 19 నెలల తర్వాత కొత్త కేసులు బయటపడుతుండటంతో అక్కడి ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ను పొడగించింది. కరోనా వైరస్ వ్యాప్తి జరుగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తున్నది. మరోవైపు, అమెరికాలో కూడా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నది.
రెండు రోజుల క్రితం కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం అమలుచేస్తున్న లాక్డౌన్ను వచ్చే నెలాఖరు వరకు పొడగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గురువారం నాడు 747 కొత్త కరోనా రోగులు నమోదయ్యాయి. శుక్రవారం కూడా 707 కేసుల రావడంతో మొత్తం కేసుల సంఖ్య 43,119 కి చేరుకున్నాయి. 978 మంది చనిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 19 నెలల అనంతరం ఇంత పెద్ద సంఖ్యలో కేసులు రావడంతో ప్రజలను అప్రమత్తం చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా దక్షిణ వేల్స్ ప్రాంతంలో ఎక్కువ కేసులు వస్తుండటంతో.. ప్రభుత్వం అక్కడ ప్రత్యేక దృష్టిని సారించింది. కొన్ని నగరాల్లో రాత్రి కర్ఫ్యూ కూడా విధించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమయాల్లో విధిగా మాస్కులు ధరించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
మరోవైపు, అమెరికాలో శుక్రవారం 3.77 లక్షల మంది కొత్త రోగులను గుర్తించారు. ఇది జనవరి 25 తర్వాత అత్యధికం. అమెరికా జైళ్లలో అంటువ్యాధి కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా జైళ్లలో ఇన్ఫెక్షన్ రేటు 34 శాతానికి పెరుగడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. అన్ని జైళ్లో సామర్థ్యం కంటే ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఇదే సమయంలో, కరోనా రోగి కనిపించిన తర్వాత న్యూజిలాండ్లో 3 రోజుల లాక్డౌన్ విధించారు. దీనిని శుక్రవారం కూడా కొనసాగించారు. రోగిని కలిసిన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.
యోగిపై పోటీకి సిద్ధమైన ఐపీఎస్కు గృహనిర్బంధం
110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్ దొంగతనం
తోటగా మారిన క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే..?
మసకబారుతున్న జో బైడెన్ గ్రాఫ్.. ఎందుకో తెలుసా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..