న్యూఢిల్లీ: మూడో రోజు కూడా పార్లమెంట్(Parliament)లో సేమ్ సీన్ రిపీటైంది. ఇవాళ లోక్సభ, రాజ్యసభలో గందరగోలం నెలకొన్నది. దీంతో రెండు సభలు 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని లోక్సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. సభను ఆర్డర్లోకి తెచ్చేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. కానీ ఫలితం కాలేదు. ప్రశ్నోత్తరాల సమయం జరిగే రీతిలో విపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. ఎటువంటి సమస్యపైన అయినా చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఖర్గే అన్నారు. కానీ విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. నినాదాలు చేశారు. దీంతో సభను 12 వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా విపక్షాలు సీజేపీ లాఠీచార్జ్ అంశాన్ని చర్చించాలని పట్టుపట్టాయి. కానీ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ వ్యతిరేకించారు. గందరగోళ నేపథ్యంలో సభను 12 వరకు వాయిదావేశారు.
మరో వైపు విపక్ష ఎంపీలు ఇవాళ నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్కు నిరసనగా నల్ల దుస్తులు ధరించినట్లు కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా ఆరోపించారు.
#WATCH | Delhi: Wearing black clothes, Opposition MPs protest on the Parliament premises.
Earlier this morning, Congress MP Pawan Khera told ANI that all Opposition MPs are wearing black today as a mark of “protest against what they have done to the students of this country in… pic.twitter.com/ov8Q26p6hL
— ANI (@ANI) July 22, 2026