చెన్నై: మంటలతో విన్యాసాలు చేయడం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. వాటిని చేయాలంటే ఎంతో ధైర్యం అవసరం. అయితే, ఒక్కోసారి అదే మంటలకు విన్యాసాలు చేసేవారు ఆహుతైపోతుంటారు. ఇలాంటి విషాద సంఘటన ఒకటి తమిళనాడులో సంభవించింది.
పుదుకొట్టై జిల్లాకు చెందిన బాలాజీ కరాటే మాస్టర్ (Karate Coach). గత కొన్నేండ్లుగా ఎందరో విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తున్నారు. సీనియర్లకు మంటలతో విన్యాసాలు చేయడం మొదలెట్టగానే, విపరీతమైన గాలులు ఒక్కసారిగా రావడంతో మంటలు అంటుకున్న బాలాజీ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తేరుకున్న శిష్యులు.. సమీపంలోని దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.
అక్కడే ఉన్న ఒకరు ఈ విన్యాసాలను తన ఫోన్లో బంధించడంతో, పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి విన్యాసాలు చేయడం నిషేధించినప్పటికీ, చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి వాటికి పూనుకొంటున్నారని పోలీసులు తెలిపారు.
ఆస్ట్రేలియాలో లాక్డౌన్ పొడగింపు
యోగిపై పోటీకి సిద్ధమైన ఐపీఎస్కు గృహనిర్బంధం
110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్ దొంగతనం
తోటగా మారిన క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే..?
మసకబారుతున్న జో బైడెన్ గ్రాఫ్.. ఎందుకో తెలుసా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..