Kangra Accident : హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రాలో ఆదివారం బస్సు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని కంగ్రా జిల్లాలో జరిగింది. ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో చంబా నుంచి ఉనా వెళ్తోంది. ఈ క్రమంలో నుర్పూర్ సమీపంలోని నియాజ్పూర్ వద్ద బస్సు బోల్తా పడింది.
ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికుల్లో 26 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ గుండె పోటుకు గురికావడం, ఈ సమయంలో బస్సును నియంత్రించలేకపోవడం వల్లే బోల్తాపడి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా. బస్సు అదుపుతప్పుతున్న సమయంలోనే కొందరు ప్రయాణికులు గమనించి తమను తాము రక్షించుకునేందుకు అప్రమత్తమయ్యారు. బస్సు బోల్తా పడినే వెంటనే స్థానికులు స్పందించారు. అధికారులకు వెంటనే సమాచారం అందించారు. వెంటనే అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని బయటకు తీశారు.
గాయపడ్డవారిని నుర్పూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందుతోంది. ఈ 26 మందిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని మెరుగైన చికిత్సకోసం టాండా మెడికల్ కాలేజీకి పంపించినట్లు వైద్యులు తెలిపారు. మిగతా వారికి గాయాలైనప్పటికీ, ప్రాణాపాయం లేదని తెలిపారు. నుర్పూర్ ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని అధికారులు తెలిపారు.