ఇండోర్ : ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మితే నట్టేట మునగడం ఖాయం అంటుంటారు పెద్దవాళ్లు. అదే దేవుళ్ల విషయానికొస్తే నమ్మకం పిచ్చిగా మారకూడదు. ఇలా మూఢనమ్మకాలతో ప్రాణాలు కోల్పోయిన వారినెందరినో చూశాం. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. (Moharram Suicide)
‘అమ్మా! మొహర్రం రోజున ఇమామ్ హుస్సేన్ వీరమరణం పొందారా? ఈ రోజున చనిపోయిన వారు స్వర్గానికి వెళతారా? ఈ రోజు మరణించినవారికి బలిదానం లభిస్తుందా?’ అని ఓ 15 ఏండ్ల వయసున్న కూతురు బేలగా తన తల్లిని ప్రశ్నించింది. తన కూతురు మనసులో ఏముందో పసిగట్టలేని ఆ అమాయకపు తల్లి.. ‘అవునమ్మా’ అని ఆ ప్రశ్నలకు సమాధానమిచ్చింది. కొద్దిసేపటికి ఇంట్లోనే దూలానికి వేళాడుతూ కనిపించింది. ముక్కులో నుంచి రక్తం కారుతుండటంతో సమీపంలోని దవాఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలోని చంపాబాగ్ ప్రాంతంలో నివసించే 15 ఏండ్ల యువతి రబియా షేక్కు దేవుడంటే మహా భక్తి. తమ దేవుడికి సంబంధించిన పుస్తకాలు చదవడం, భక్తితో కొలవడం చేస్తుంటుంది. మొహర్రం రోజున కూతురుకు ఇష్టమైన ఖీర్ కూడా వండింది. శుక్రవారం నాడు ఉపవాస దీక్ష విడిచేందుకు ఉద్యుక్తులవుతున్న తరుణంలో.. ఇంట్లో నుంచి రబియా ఆత్మహత్య చేసుకున్న అరుపు వినిపించింది. అంతే, కుటుంబసభ్యులు ఆహారపదార్థాలను వదిలేసి కూతురు ప్రాణాలను కాపాడుకునేందుకు దవాఖానకు పరిగెత్తారు.
కొన్నాళ్ల క్రితం రబియా షేక్ తోటి విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. అక్కడ రబియా ప్రాణస్నేహితురాలు కాలుజారి లోయలో పడి ప్రాణాలు విడిచింది. అప్పటి నుంచి రబియా మానసికంగా అనారోగ్యం పాలైందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. అప్పటి నుంచి తమను పుట్టుక, చావు గురించి ప్రశ్నించేదని, కానీ ఇలా చేస్తుందని అనుకోలేదని వారు భోరున విలపించారు. పదో తరగతి పరీక్షలో 93 శాతం మార్కులతో రబియా ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది.
రక్షాబంధన్ రోజున ఆరోగ్య రక్ష.. ఇలా ట్రై చేయండి..!
మన సంస్కృతి, వారసత్వం గురించి యువత తెలుసుకోవాలి: వెంకయ్యనాయుడు
ఆఫ్ఘాన్లో క్రికెట్ భవితవ్యం ఏంటి..?
మంటలతో విన్యాసాలు.. కరాటే కోచ్ మృతి
ఆస్ట్రేలియాలో లాక్డౌన్ పొడగింపు
యోగిపై పోటీకి సిద్ధమైన ఐపీఎస్కు గృహనిర్బంధం
110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్ దొంగతనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..