Manish Sisodia | మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఢిల్లీ కోర్టు (Delhi Court)ను ఆశ్రయించారు. మద్యం కేసులో అరెస్టైన ఆయన తనకు బెయిల్ (Bail) మంజూరు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మనీశ్ సిసోడియా (Manish Sisodia) ప్రస్తుతం ఐదు రోజుల సీబీఐ (CBI) కస్టడీలో ఉన్నారు. ఆయన కస్టడీ శనివారంతో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియాను సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ సమయంలోనే బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ జరపనున్నట్లు సమాచారం.
గత ఆదివారం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీం ధర్మాసనం సిసోడియాకు సూచించింది. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ఢిల్లీ కోర్టులో బెయిల్ పిటిషన్కు దాఖలు చేశారు.
Also Read..
China | అమ్మాయిల లోదుస్తుల ప్రకటనల్లో అబ్బాయిలు.. చైనా వ్యాపారుల కొత్త పంథా..!
Australia | ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయంపై దాడి.. ప్రహరీ గోడ ధ్వంసం..!
Covid Origins: కోవిడ్ ఆనవాళ్ల గురించి చెప్పండి : డబ్ల్యూహెచ్వో