Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ (AA) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీ ( judicial custody)ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో సిసోడియాని తీహార్ జైలు (Tihar Jail)కు తరలించారు. అవినీతి కేసులో గత నెల 26 సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న సిసోడియాను నేడు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
కేసుకు సంబంధించి సిసోడియా నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆయన కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. దాంతో కోర్టు మార్చి 20 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. కోర్టు తీర్పుతో మార్చి 20వ తేదీ వరకు సిసోడియా తీహార్ జైలులో ఉండనున్నారు.
Also Read..
Manish Sisodia | మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 20 వరకు పొడిగింపు
Maharashtra | దారుణం.. యూట్యూబ్ చూసి డెలివరీ చేసుకున్న 15 ఏండ్ల బాలిక.. శిశువును చంపి..!
Jennifer Gates | తాత అయిన బిల్గేట్స్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జెన్నిఫర్
Chris Williams | టెక్ రంగంలో లేఆఫ్స్.. ఎవరికి ఎక్కువ రిస్క్ అంటే..!