Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లోని నాగ్పూర్ (Nagpur)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15 ఏండ్ల ఓ బాలిక యూట్యూబ్ (YouTube)లో చూస్తూ ఇంట్లోనే సొంతంగా డెలివరీ (delivered) చేసుకొంది. అనంతరం పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది (killed the newborn). ఘటనకు సంబంధించి పోలీసులు (Police) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానిక అంబజారీ ప్రాంతానికి (Ambazari area) చెందిన ఓ 15 ఏండ్ల బాలికకు సోషల్ మీడియా (social media) ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత సదరు వ్యక్తి ఆ బాలికకు లైంగికంగా దగ్గరవ్వడంతో (sexually exploited by a man) ఆమె గర్భం (Pregnent)దాల్చింది. ఆ విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టింది. కొన్ని రోజులకు కడుపు పెద్దగా కనిపించడంతో తల్లి ప్రశ్నించింది. అయితే అనారోగ్యం కారణంగానే కడుపు ఉబ్బిందంటూ తల్లికి అబద్దాలు చెప్పింది. అనంతరం డెలివరీ ఎలా చేసుకోవాలో యూట్యూబ్ వీడియోలను చూసి తెలుసుకుంది.
ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును గొంతునులిమి చంపేసి.. ఇంట్లోనే ఓ పెట్టెలో మృతదేహాన్ని దాచిపెట్టింది. పనిమీద బయటకు వెళ్లిన తల్లి ఇంటికి తిరిగొచ్చేసరికి బాలిక అనారోగ్యంతో నీరసంగా కనిపించింది. దీంతో ఆమె గట్టిగా నిలదీయగా.. ఆ బాలిక మొత్తం విషయాన్ని తల్లికి చెప్పేసింది. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి.. నవజాతశిశువు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించామని పోలీసులు తెలిపారు.
Also Read..
Imran Khan | ఇమ్రాన్కు పాకిచ్చిన పాక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ
Jr NTR | అమెరికా పయనమైన తారక్.. పిక్స్ వైరల్..!
Jennifer Gates | తాత అయిన బిల్గేట్స్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జెన్నిఫర్
Mahindra SUV | స్కార్పియో-ఎన్ సన్రూఫ్ నుంచి వాటర్ లీక్.. స్పందించిన మహీంద్రా సంస్థ