Imran Khan | పాకిస్థాన్ (pakistan) మాజీ ప్రధాని, పీటీఐ (PTI) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan)కు ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (Electronic Media Regulatory Authority-PEMRA)(పీఈఎంఆర్ఏ) షాకిచ్చింది. దేశంలోని అన్ని టెలివిజన్ ఛానెళ్లు ఇమ్రాన్ ప్రసంగాలను, ప్రెస్ చర్చలను (ప్రత్యక్ష, రికార్డ్ చేయబడినవి) ప్రసారం చేయడంపై నిషేధం విధించింది. తోషాఖానా కేసు (Toshakhana case) కు సంబంధించి ఇస్లామాబాద్ పోలీసులు (Islamabad Police) ఇమ్రాన్ను అరెస్టు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (Tehreek-e-Insaf) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan ) నిరంతరం తన ప్రసంగాలు, ప్రకటనలలో నిరాధారమైన ఆరోపణలు చేయడం, ప్రభుత్వ సంస్థలు, అధికారులపై రెచ్చగొట్టే ప్రకటనలు చేయడాన్ని గుర్తించాం. విద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేయడం ద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంది’ అని మీడియా రెగ్యులేటరీ అథారిటీ ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, ఆదివారం ఇమ్రాన్ (Imran Khan ) ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. లాహోర్ (Lahore)లో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు (Islamabad Police) జమాన్ పార్క్ రెసిడెన్సీకి రావడం.. దీంతో ముందుగానే పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని అడ్డుకోవడంత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఇమ్రాన్ మాట్లాడుతూ.. పాక్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. షెహబాజ్ షరీఫ్ నాటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా దయతో ప్రధాని అయ్యారని వ్యాఖ్యానించారు. షెహబాజ్ షరీఫ్ వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతికి పాల్పడి అరెస్టు అవ్వాల్సిన నేతను ప్రధానిని చేయడం వల్లే తమ దేశ పతనానికి దారి తీసిందని ఆరోపించారు.
ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో భారీగా వచ్చిన బహుమతులను తోషాఖానాలో జమ చేయకుండా అమ్ముకున్నాడని ఇమ్రాన్ఖాన్పై ఆరోపణలున్నాయి. ఈ కేసు (Toshakhana case)లో ఇమ్రాన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు నాన్-బెయిల్బుల్ అరెస్టు వారెంట్తో లాహోర్లోని జమాన్ పార్క్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు, పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (PTI) కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణకు ఇమ్రాన్ఖాన్ మూడుసార్లు ఇస్లామాబాద్ సెషన్ కోర్టుకు గైర్హాజరు కావడంతో ఆయనను అరెస్ట్ చేయాలంటూ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ ఉత్తర్వులు జారీ చేసినట్టు ‘డాన్’ పత్రిక పేర్కొంది. ఇమ్రాన్ను అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని ఫవాద్ చౌదరి హెచ్చరికలతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తమ నేతపై 74 కేసులు ఉన్నాయని, ఒక వ్యక్తి ఇన్ని కేసుల్లో కోర్టులకు హాజరు కావడం అసాధ్యమని ఫవాద్ అన్నారు. త్వరలో పంజాబ్లో జరగబోయే సాధారణ ఎన్నికలను వాయిదా వేయించడానికే పాలకులు ఇమ్రాన్ అరెస్ట్కు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read..
Jennifer Gates | తాత అయిన బిల్గేట్స్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జెన్నిఫర్
Mahindra SUV | స్కార్పియో-ఎన్ సన్రూఫ్ నుంచి వాటర్ లీక్.. స్పందించిన మహీంద్రా సంస్థ
Jr NTR | అమెరికా పయనమైన తారక్.. పిక్స్ వైరల్..!