Sania Mirza | తన అసమాన ప్రతిభతో రెండు దశాబ్దాల పాటు అభిమానులను అలరించిన భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza ).. తన ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ (Hyderabad) ఎల్బీ స్టేడియం (Lb Stadium) టెన్నిస్ కాంప్లెక్స్ (Tennis Complex) లో ఏర్పాటు చేసిన రెండు మిక్స్డ్ డబుల్స్ ఎగ్జిబిషన్ మ్యాచ్ల్లోనూ సానియా జోడీ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ద్వారా సానియా తన సుదీర్ఘ ప్రయాణానికి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ముగింపు పలికింది.
సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికిన సానియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు స్టార్ క్రీడాకారులు, సినీతారలు, రాజకీయ ప్రముఖులు సానియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) నటుడు, టాలీవుడ్ (Tollywood) స్టార్ రామ్ చరణ్ (Ramcharan) స్పందించారు. ఈ మేరకు భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ‘నా ప్రియమైన స్నేహితురాలు సానియా మీర్జా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ కోర్ట్లు మీ ఆటను మిస్ అవుతాయి. భారతదేశంలో క్రీడలకు మీరు అందించిన సహకారం ఎనలేనిది. మీరు మమ్మల్ని గర్వపడేలా చేస్తూనే ఉన్నారు’ అంటూ చరణ్ ట్వీట్ చేశారు. దీంతోపాటు ఉపాసన (Upasana), సానియా (Sania)తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
My dearest buddy @MirzaSania … Tennis courts across the world will miss seeing you in action.
Your contribution to sports in India is unmatched.
You continue to make us proud. pic.twitter.com/PL7fYORECZ— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2023
భావోద్వేగ వీడ్కోలు..
కాగా, రెండు దశాబ్దాల క్రితం ఎక్కడ మొదలు పెట్టిందో.. అక్కడే సానియా మీర్జా తన చివరి మ్యాచ్తో సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికింది. తొలి డబ్ల్యూటీఏ టైటిల్ (2004లో) నెగ్గిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో.. ఆనంద భాష్పాల నడుమ సానియా అల్విదా చెప్పింది! ఇప్పటికే ప్రొఫెషనల్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్.. ఆదివారం ఎల్బీ టెన్నిస్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడింది. కేంద్ర, రాష్ట్ర మంత్రుల నుంచి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షిచంగా..స్టేడియం మొత్తం ‘సానియా.. సానియా..’ నామస్మరణతో మార్మోగిపోయింది. ప్రముఖులు, కుటుం సభ్యుల సమక్షంలో సానియా తన సుదీర్ఘ కెరీర్కు ఆదివారం భావోద్వేగ వీడ్కోలు పలికింది. మరెందరో సానియాలను తయారు చేయడమే తన లక్ష్యమంటూ అభిమానులకు అల్విదా చెప్పింది. వీడ్కోలు వేదికపై సానియాను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ సన్మానించారు. అనంతరం సాయంత్రం మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్లో సానియా మీర్జా ఫేర్వెల్ రెడ్ కార్పెట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.
Also Read..
Pakistan | పాక్లో ఆత్మాహుతి దాడి.. తొమ్మిది మంది పోలీసులు మృతి
Chris Williams | టెక్ రంగంలో లేఆఫ్స్.. ఎవరికి ఎక్కువ రిస్క్ అంటే..!
Maharashtra | దారుణం.. యూట్యూబ్ చూసి డెలివరీ చేసుకున్న 15 ఏండ్ల బాలిక.. శిశువును చంపి..!
Imran Khan | ఇమ్రాన్కు పాకిచ్చిన పాక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ