కోల్కతా : 2024 సార్వత్రిక ఎన్నికల్లో మార్పు ఖాయమని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. గత పదేండ్లుగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు.
Next election of 2024 will be of change, in the last 10 years, this govt (BJP-led Central govt) hasn't done anything, it only changed history, did jumla politics & injustice in the name of NRC. I urge all the Opposition parties to get united and I am sure BJP will lose power:… pic.twitter.com/dQTTwX4iJH
— ANI (@ANI) May 2, 2023
కేంద్రంలో కాషాయ సర్కార్ చరిత్రను మార్చడం, ఎన్ఆర్సీ పేరుతో అన్యాయం చేయడం మినహా మోదీ సర్కార్ ప్రజల కోసం పాటుపడిందేమీ లేదని దీదీ దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీ సర్కార్ను నిలువరించాలని కోరారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మట్టికరుస్తుందని అన్నారు. విపక్షాలు ఏకమైతే బీజేపీ ఓటమిపాలవుతుందని, విభజిత శక్తులపై భారత్ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చు రేపుతున్న బీజేపీ కుయుక్తులను ఎండగడుతూ ప్రజలంతా ఏకం కావాలని దీదీ పిలుపు ఇచ్చారు.
Read More
Ukraine | ‘కాళీమాత’ ఫొటోతో వివాదాస్పద ట్వీట్.. క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్