The Kerala Story | దేశవ్యాప్తంగా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే దుష్ట పన్నాగంతోనే సంఘ్ పరివార్ శక్తులు ఈ చిత్రాన్ని నిర్మించారని కేరళ (Kerala) అధికార పార్టీ సీపీఎం (CPM), ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ (Censor) పూర్తి చేసుకుంది. రాజకీయంగా వివాదాస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు (Censor Board) ‘ఏ’ సర్టిఫికెట్ (A certificate) ఇచ్చింది. దీంతో పాటు కొన్ని సన్నివేశాలను తొలగించాలని, మరికొన్ని డైలాగుల్లో మార్పులు చేయాలని సూచించింది.
ఈ సినిమాలోని వివిధ సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొత్తం 10 సన్నివేశాలు (removes 10 scenes) వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని వెంటనే తొలగించాలని సూచించింది. ఇందులో ముఖ్యంగా రాజకీయంగా దుమారం రేపుతున్న కేరళ మాజీ సీఎం ఇంటర్వ్యూ సన్నివేశాలను కచ్చితంగా తొలగించాలని ఆదేశించింది. దీంతోపాటు కొన్ని డైలాగులు, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న సన్నివేశాలను డిలీట్ చేయాలని ఆదేశించింది.
హిజాబ్, లవ్ జిహాద్ ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ (Sudipto Sen) ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అదా శర్మ (adah sharma) ప్రధాన పాత్ర పోషించారు. లవ్ జిహాద్ ద్వారా కేరళకు చెందిన 32 వేల మందిని ముస్లిం మతంలోకి మార్చి, సిరియాకు తరలించారనే ఆరోపణలపై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంపై కేరళలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు వాదనల ద్వారా సమాజంలో వర్గ విభేదాలు సృష్టించే లక్ష్యంతో నిర్మించిన వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వొద్దని సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read..
కేరళ స్టోరీ నిరూపిస్తే కోటి రివార్డు
snake venom | బంగ్లా టు భారత్.. రూ.13 కోట్ల విలువైన పాము విషం అక్రమ రవాణా
Ukraine | ‘కాళీమాత’ ఫొటోతో వివాదాస్పద ట్వీట్.. క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్