ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దీంతో భారీ సంఖ్యలో బాధితులు హాస్పిటళ్లకు క్యూకడుతున్నారు. కరోనా తీవ్రతతో ఆక్సిజన్ అందకపోవడంతో దవాఖానల్లో చాలా మంది రోగులు మృతిచెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరతను పరిష్కరించడానికి.. ప్రాణవాయువు అవసరాలు, సరఫరాపై జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. దేశంలో ఆక్సిజన్ కొరత ఉండటంతోనే అత్యున్నత న్యాయస్థానం నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను ఏర్పాటు చేసింది. ప్రాణవాయువు కొరత వల్ల ప్రజలు ప్రాణాలొదులుతున్నారు. మహారాష్ట్ర కూడా ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్నది. అయితే ఈ సమస్యను ప్రభుత్వం విజయంతంగా పరిష్కరించింది. ఎన్టీఎఫ్ చాలా కష్టపడాల్సి ఉంటుందని సంజయ్ రౌత్ చెప్పారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో.. ప్రాణవాయువు అవసరాలు, సరఫరాపై జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఎన్టీఎఫ్ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా శాస్త్రీయంగా, హేతుబద్దతతో సమానంగా ఆక్సిజన్ను పంపిణీ చేయాల్సిన బాధ్యతను ఈ టాస్క్ఫోర్స్కు అప్పగించింది.
ఇందులో బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెన్స్ వైస్ చాన్సలర్ డాక్టర్ భబతోష్ బిశ్వాస్, గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఎండీ డాక్టర్ నరేశ్ ట్రెహాన్, దిల్లీలోని గంగారామ్, తమిళనాడు రాయవెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, బెంగళూరులోని నారాయణ హెల్త్కేర్, ముంబయిలోని ఫోర్టిస్ ఆసుపత్రుల్లోని ప్రముఖ వైద్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి