కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని జలదపర నేషనల్ పార్క్లో ఆరుగురు టూరిస్టులతో ప్రయాణిస్తున్న జీపు బోల్తా పడింది. జంగిల్ సఫారీ సందర్భంగా టూరిస్టుల వాహనంపైకి ఖడ్గ మృగం దూసుకురావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ఆకాష్ దీప్ భదవాన్ ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకూ 2 లక్షల మంది వీక్షించారు.
I think it’s about time guidelines for safety and rescue in adventure sports are implemented in wildlife safaris across the country. Safaris are becoming more of adventure sports now!
Jaldapara today! pic.twitter.com/ISrfeyzqXt— Akash Deep Badhawan, IFS (@aakashbadhawan) February 25, 2023
24 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో జీప్లో ఉన్న టూరిస్టులు ఖడ్గమృగం ఫొటోలను తీస్తుండగా అనూహ్యంగా జంతువు వారి వాహనాన్ని వెంబడిస్తుంది. డ్రైవర్ వెనువెంటనే రివర్స్ చేసేందుకు ప్రయత్నించగా వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కగా దూసుకెళ్లి బోల్తా పడటం కనిపిస్తుంది.
జీపు వెనుక ఉన్న వాహనంలోని టూరిస్ట్ ఈ మొత్తం ఘటనను కెమెరాలో రికార్డు చేశారు. దేశవ్యాప్తంగా వన్యప్రాణి కేంద్రాల్లో భద్రత, సహాయ కార్యక్రమాలకు మార్గదర్శకాలను నిర్ధేశించాల్సిన సమయం ఇదే..సఫారీలు అడ్వంచర్ స్పోర్ట్గా మారాయి..జలదపరలో ఇలాంటి అనుభవమే ఎదురైంది! అని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు.
Read More :