తిరువనంతపురం : కేరళ కన్నూరు జిల్లాలోని పానూరులో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీకి చెందిన కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ కార్యకర్త కొత్తుపరంబ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఏజెంట్గా ఉన్నాడు. అయితే అతను బోగస్ ఓట్లు వేయించినట్లు సీపీఐ(ఎం) కార్యకర్తలు ఆరోపించారు.
ఈ క్రమంలో రాత్రి 8 గంటలకు ఐయూఎంఎల్ కార్యకర్తతో పాటు అతని సోదరుడిపై దాడి చేశారు. కార్యకర్తను తీవ్రంగా చితకబాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు తీవ్ర గాయాల పాలు కావడంతో.. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్ హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పానూరులో పోలీసులు భారీగా మోహరించారు.
ఇవి కూడా చదవండి..