45 ఏండ్లు దాటిన వారంతా కొవిడ్ వాక్సిన్ను ఖచ్చితంగా వేసుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నం.12 ఎన్బీటీనగర్లోని బస్తీ దవాఖానలో కొవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం మేయర్ ప్రారంభించి.. పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 45ఏండ్లు దాటిన వారికి ప్రభుత్వం తరపున ఉచితంగా వాక్సిన్ వేస్తున్నారని, ఎలాంటి అపోహాలు పెట్టుకోకుండా వాక్సిన్ వేయిం చుకోవాలన్నారు. నగర వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని మేయర్ సూచించారు.