అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో క్షిపణి శకలాలు పడి ఇద్దరు మరణించారు. మృతుల్లో ఒక భారతీయ పౌరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు వెల్లడించారు. (Indian killed by falling missile debris) గురువారం అబుదాబిపై బాలిస్టిక్ క్షిపణి దాడి జరిగింది. యూఏఈ ఎయిర్ డిఫెన్స్ ఆ క్షిపణిని అడ్డుకున్నది.
కాగా, కొందరు వ్యక్తులపై క్షిపణి శకలాలు పడ్డాయి. ఈ సంఘటనలో ఇద్దరు విదేశీయులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఒకరిని భారతీయ పౌరుడిగా, మరొకరిని పాకిస్థానీ జాతీయుడిగా గుర్తించారు.
మరోవైపు గాయపడిన ముగ్గురిలో మరో భారతీయ పౌరుడు, జోర్డాన్ జాతీయుడు, ఎమిరాటీ ఉన్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే పొందాలని, పుకార్లు లేదా ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదని సూచించింది. అయితే ఇరాన్ ఈ దాడి చేసినట్లు జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. తమ పౌరుడు గాయపడిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొంది.
Also Read:
Tanker with Russian oil struck | రష్యా చమురుతో వెళ్తున్న ట్యాంకర్పై.. డ్రోన్ బోటు దాడి
Air India London flight U-turn | ఎయిర్ ఇండియా లండన్ విమానం.. సౌదీ గగనతలంలో యూ టర్న్