న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లను వాడే దేశాల జాబితాలో భారతదేశానికి మూడో స్థానం దక్కింది. అత్యధిక వినియోగంలో బ్రెజిల్ ఉండగా.. రెండో స్థానం ఇండోనేషియాకు దక్కింది. భారతీయులు ప్రతిరోజూ 4 గంటలకు పైగా మొబైల్ ఫోన్లపై గడుపుతున్నట్లు పరిశోధనలో తేలింది.
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లు ప్రజల జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ పనీ చేయలేని పరిస్థితికి చేరుకున్నాం. ఇలా ప్రతీ చిన్న విషయాన్ని మొబైల్ ఫోన్లను వాడుతూ మనం మొబైల్ వాడకంలో ప్రపంచంలో మూడవ స్థానాకి వచ్చాం. జెడ్డీ నెట్ న్యూస్ వెబ్సైట్ నివేదిక ప్రకారం, బ్రెజిలియన్లు ప్రపంచంలో అత్యధిక మొబైల్లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్ ప్రజలు రోజువారీ సగటున 5 గంటలు 4 నిమిషాలు మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఇండోనేషియా దేశం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ నిత్యం 5 గంటల 3 నిమిషాలు మొబైల్లో గడుపుతున్నారు. 4 గంటల 9 నిమిషాల పాటు మొబైల్ వాడకంతో భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది.
ఈ నివేదిక ప్రకారం, దక్షిణ కొరియాకు నాల్గవ ర్యాంకు లభించింది. దక్షిణ కొరియన్లు ప్రతిరోజూ 4 గంటలు 8 నిమిషాలు మొబైల్లను ఉపయోగిస్తున్నారు. 4 గంటల 7 నిమిషాల మొబైల్ వాడకంతో మెక్సికో 5 వ స్థానంలో ఉన్నది. టర్కీ 4 గంటల 5 నిమిషాలతో 6 వ స్థానంలో, 4 గంటల 4 నిమిషాలతో జపాన్ 7 వ స్థానంలో, 4 గంటల 1 నిమిషంతో కెనడా 8 వ స్థానంలో, అమెరికా 3 గంటల 9 నిమిషాలు, యూకే 3 గంటల 8 నిమిషాలతో 9, 10 వ స్థానాల్లో నిలిచాయి.
వచ్చే ఏడాది దసరా కల్లా ఎంజే ఫీల్డ్ నుంచి రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి
కశ్మీర్లో రాష్ట్రపతి కోవింద్ పర్యటన
ఎల్లుండి భారత్లో అమెరికా విదేశాంగ మంత్రి పర్యటన
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
3 డీ ప్రింటింగ్తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి
‘నేషన్ ఫస్ట్’ మంత్రంతో ముందుకు : మన్ కీ బాత్లో మోదీ
చరిత్రలో ఈరోజు.. 43 ఏండ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..