న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ఎంజే ఫీల్డ్ నుంచి సహజ వాయువు ఉత్పత్తిని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభిస్తే మొత్తం ఉత్పత్తి మూడింట రెండు వంతుల వరకు పెరుగుతుంది. కేజీ-డీ6 బ్లాక్లో ఇది మూడవ, ఆఖరి గ్యాస్ క్షేత్రం. రిలయన్స్ సంస్థ ఇప్పుడు దీనిని అభివృద్ధి చేస్తున్నది. మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తూ, ఆఫ్షోర్ ఇన్స్టాలేషన్ మొదటి దశను పూర్తి చేసినట్లు ఆర్ఐఎల్ తన పెట్టుబడిదారులకు తెలిపింది. రెండవది ఈ ఏడాది నవంబర్లో ప్రారంభమవుతుంది.
కేజీ-డీ6 బ్లాక్లోని లోతైన గ్యాస్ బ్లాక్లో ఉత్పత్తి కోసం తేలియాడే ఉత్పత్తి వ్యవస్థను ఉపయోగించాలని ఆర్ఐఎల్, దాని భాగస్వామి యూకేకు చెందిన బీపీ పీఎల్సీ ప్రణాళికగా ఉన్నది. ఎంజే-1 గ్యాస్ క్షేత్రం ధీరూభాయ్-1, 3 కి 2,000 మీటర్ల దూరంలో ఉన్నది. ఎంజే-1 కి కనీసం 0.988 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల వనరులు ఉన్నాయని అంచనా.
కేజీ-డి 6 బ్లాక్లో ఆర్ఐఎల్, బీపీ మూడు డీప్ వాటర్ గ్యాస్ బ్లాక్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ మూడు బ్లాక్స్ – ఆర్ క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్, ఎంజే. ఈ మూడింటినీ కలిపి రోజుకు 30 మిలియన్ ప్రామాణిక క్యూబిక్ మీటర్లు ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు. దీంతో భారతదేశం యొక్క మొత్తం గ్యాస్ డిమాండ్లో 15 శాతం తీర్చవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్-క్లస్టర్ ఉత్పత్తి 2020 డిసెంబర్లో ప్రారంభమైంది. శాటిలైట్ క్లస్టర్ నుంచి ఉత్పత్తి ఏప్రిల్లో ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కేజీ-డీ 6 సగటున 16.6 ఎంఎంసీఎమ్డీ గ్యాస్ను ఉత్పత్తి చేసిందని ఆర్ఐఎల్ తెలిపింది. ఈ ఫీల్డ్ నుంచి 18 రౌండ్ల బిడ్డింగ్లో కంపెనీ 18 ఎంఎంసీఎమ్డీ గ్యాస్ను విక్రయించింది.
కశ్మీర్లో రాష్ట్రపతి కోవింద్ పర్యటన
ఎల్లుండి భారత్లో అమెరికా విదేశాంగ మంత్రి పర్యటన
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
3 డీ ప్రింటింగ్తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి
‘నేషన్ ఫస్ట్’ మంత్రంతో ముందుకు : మన్ కీ బాత్లో మోదీ
చరిత్రలో ఈరోజు.. 43 ఏండ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..