న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 43,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి నిన్నటి కంటే 5.4 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,07,52,950కి చేరింది. ఇందులో 2,98,88,284 మంది కరోనా నుంచి బయటపడగా, 4,58,727 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 4,05,939 మంది కరోనా మహమ్మారి వల్ల మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 44,459 మంది బాధితులు డిశ్చార్జీకాగా, 911 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నదని వెల్లడించింది. గత 24 గంటల్లో 40,23,173 డోసులను పంపిణీ చేశామని తెలిపింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 36,89,91,222 చేరిందని పేర్కొన్నది.
దేశవ్యాప్తంగా జూలై 8 వరకు 42,70,16,605 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 17,90,708 నమూనాలను పరీక్షించామని తెలిపింది.