బెంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. జాతీయ జెండాను చేతపట్టి రెపరెపలాడించారు. అయితే ఆయన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్ణాటకలో కొనసాగుతున్నది. బీజేపీ పాలిత తొలి రాష్ట్రానికి చేరిన ఈ యాత్రలో రాహుల్ గాంధీ చాలా జోష్లో ఉన్నారు. ఆదివారం నాటి యాత్రలో భాగంగా ఒక గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఆయన ఎక్కారు. జాతీయ జెండాను చేతపట్టి అటూ ఇటూ ఊపి అక్కడి ప్రజలకు అభివాదం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం శిద్దరామయ్య కూడా రాహుల్ గాంధీతో పాటు ఆ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు.
కాగా, ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘తిరంగా మనందరినీ ఏకం చేసింది. త్రివర్ణ పతాకం నిజమైన సారాన్ని ‘భారత్ జోడో యాత్ర’ స్వీకరిస్తుంది’ అని ఆ పోస్ట్లో పేర్కొంది. మరోవైపు సెప్టెంబర్ 30న కర్ణాటకలో ప్రవేశించిన ‘భారత్ జోడో యాత్ర’ ఆ రాష్ట్రంలో ఈ నెల 20న ముగుస్తుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభమై కశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర సాగే ‘భారత్ జోడో యాత్ర’ మొదలై ఒక నెల అయ్యింది.
सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा सरसाने वाला,
वीरों को हर्षाने वाला, मातृभूमि का तन-मन सारा।।
झंडा ऊंँचा रहे हमारा।।#BharatJodoYatra pic.twitter.com/MvqZN4ROsx— Congress (@INCIndia) October 13, 2022
Tiranga unites us all.#BharatJodoYatra embraces the true essence of the Tricolour.pic.twitter.com/utpGxMTVTn
— Congress (@INCIndia) October 13, 2022