Sharad Pawar : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై శరద్పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలన్నీ అర్వింద్ కేజ్రీవాల్కు సహకరించాలని, అది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. ఇండియా కూటమిలో రాష్ట్రాల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఎలాంటి చర్చ జరగలేదని, ఇండియా కూటమి జాతీయ స్థాయిలో మాత్రం కలిసికట్టుగా పనిచేస్తుందని అన్నారు.
అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు సహకరించాలనేది తన అభిప్రాయమని శరద్ పవార్ చెప్పారు. మహారాష్ట్రలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలా.. లేదంటే కలిసి పోటీ చేయాలా అనేది చర్చల ద్వారా నిర్ణయించాల్సి ఉందన్నారు. వచ్చే 8-10 రోజుల్లో కూటమి పార్టీల నేతలు సమావేశమై ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములే అయినా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు వెళ్లలేదు. దాంతో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొన్నది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు సహకరించాలనేది తన అభిప్రాయం అనడం గమనార్హం.
Arvind Kejriwal | వాళ్లు డబ్బు, బంగారం పంచినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా..? : అర్వింద్ కేజ్రీవాల్
Atishi nomination | కల్కాజీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. Video
Actress Honey Rose | లైంగిక వేధింపుల కేసులో బాబీ చెమ్మనూర్కు బెయిల్
UGC-NET | యూజీసీ నెట్ పరీక్ష వాయిదా.. ఎందుకంటే