Mallikarjun Kharge | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిజంగానే తీవ్రంగా పరిగణించి ఉంటే.. తొలుత ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (Biren Singh)ను బర్తరఫ్ చేసి ఉండేవారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. పార్లమెంట్ వెలుపల ఆగ్రహం వ్యక్తం చేయడం సరిపోదని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చి తప్పుడు ఆరోపణలు చేయడానికి బదులుగా మణిపూర్ సీఎంను పదవి నుంచి తొలగించాలని (dismiss) డిమాండ్ చేశారు.
‘మణిపూర్ ఘటనపై ప్రధాని నేడు పార్లమెంట్ లో ప్రకటన చేస్తారని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. 80 రోజులుగా మణిపూర్ మండిపోతున్నా ప్రభుత్వం నోరు విప్పకుండా.. పూర్తి నిస్సహాయతతో ఉండిపోయింది. ఎలాంటి పశ్చాత్తాపం చెందలేదు. మోదీ నిజంగానే మణిపూర్ ఘటనపై బాధపడి ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై అసత్య ఆరోపణలు మాని బీరేన్ సింగ్ ను డిస్మిస్ చేసి ఉండేవారు’ అని ఖర్గే ట్విట్టర్ లో పేర్కొన్నారు.
.@narendramodi ji,
You did not make a statement inside the Parliament, yesterday.
If you were angry then instead of making false equivalence with Congress governed states, you could have first dismissed your Chief Minster of Manipur.
INDIA expects you to make an elaborate…
— Mallikarjun Kharge (@kharge) July 21, 2023
Also Read..
Heavy Rain Alert | తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Varuntej – Lavanya | వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. ?
Parliament Sessions | విపక్షాల ఆందోళన.. లోక్ సభ సోమవారానికి వాయిదా