Ronald Ross | సిటీబ్యూరో, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ పర్యటించారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్, మాదాపూర్ ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లోని వాటర్ లాగింగ్ పాయింట్లను ఆయన వెస్ట్జోన్ కమిషనర్ స్నేహశబరీష్తో కలిసి పరిశీలించారు.
ఐటీ కారిడార్ ప్రాంతంలో వర్షానికి రహదారులపై నీరు నిలిచి.. తీవ్ర ట్రాఫిక్ జామ్కు కారణమవుతున్నదని, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను అదేశించారు. కాగా, హైదరాబాద్ సమగ్రాభివృద్ధ్దే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి పనులను చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. రాబోయే 6 నెలలకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో ఆయన సమీక్షించారు.