హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నినదించిన 369 మంది అమాయ క విద్యార్థులు, యువకులను తుపాకీగుళ్లకు బలిచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డిని మహనీయుడని కీర్తిస్తూ తెలంగాణ సీఎంవో అధికారికంగా ఆయనకు నివాళులర్పించడాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. నాటి ఉద్యమ సమయంలో కాల్పుల్లో మరణించిన వారి మృతదేహాలను సైతం కుటుంబాలు, బంధువులకు అప్పగించకుండా, రాత్రికి రాత్రే దహ నం చేయించిన ఘోరం కాసు బ్రహ్మానందరెడ్డిదని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనూ తెలంగాణ చరిత్ర, ఇకడి ప్రజల ఆకాంక్షలు, అమరుల త్యాగాలను కాళ్లకింద వేసి తొకుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన వారిని విస్మరించి, నాటి ఉద్యమాన్ని క్రూరంగా అణచివేసిన పాలకులను అధికారికంగా కీర్తించడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.
1969 ఉద్యమంలో శాంతియుతం గా నిరసన తెలుపుతున్న 369 మంది విద్యార్థులు, యువకులను నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిందని దేశపతి గుర్తుచేశారు. అంతులేని రక్తపాతాన్ని సృష్టించిన వ్యక్తులను మహనీయులుగా అభివర్ణించడం చారిత్రక నేరమని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నది అమరుల త్యాగాల పునాదుల పైనేనని, అలాంటిది నేడు తెలంగాణ అధికారిక పీఠంపై ఉండి అమరుల హంతకులకు నివాళులర్పించడం అమరుల ఆత్మలను క్షోభ పెట్టడమేనని హెచ్చరించారు. ఈ ఘటన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నదని, ప్రభుత్వ వైఖరిని ప్రతిఒకరూ ఖండించాలని దేశపతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.