ఖైరతాబాద్, సెప్టెంబర్ 15 : ఖైరతాబాద్లో 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్, నాయకులు బాక్సర్ అశోక్, మహేశ్ యాదవ్, రాంరెడ్డి, ఆనంద్, మహేందర్ బాబు తదితరులు దర్శించుకున్న వారిలో ఉన్నారు.