లఖింపుర్ ఖేరి : (Rakesh Tikait) ‘ప్రభుత్వానికి ఆరు రోజుల సమయం ఇస్తున్నాం. ఆలోగా నిందితులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే మా నుంచి మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుంది’ అని రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ ఆర్గనైజేషన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ తికాయత్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన లఖింపుర్లో మీడియాతో మాట్లాడారు. ప్రమాదం చేసిన వారిని నరమాంస భక్షుకులని దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి మండలి నుంచి అజయ్ మిశ్రను తొలగించాలని మోదీకి విజ్ఞప్తి చేశారు,
లఖింపుర్ ఖేరి సంఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను కలిసేందుకు రాజకీయ నేతలు క్యూ కట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ, ఎంపీ సంజయ్ సింగ్తోపాటు చాలా మంది నాయకులు లఖింపుర్ను సందర్శించేందుకు యూపీ ప్రభుత్వం అనుమతించింది. దాంతో లఖింపుర్లో రాజకీయ ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అందరికన్నా ముందుగా, రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ లశింపుర్ ఖేరీలో మరణించిన రైతు కుటుంబాలతో సమావేశమయ్యారు. అనంతరం, నిందితులపై చర్యలు తీసుకునేందుకు ఆరు రోజుల డెడ్లైన్ విధించారు.
‘రైతులపైకి వాహనాలను పోనిచ్చి పలువురి మృతికి కారకులైన వారు భయంకరమైన నరమాంస భక్షకులు. అలాంటి వారిని ఊరికే విడిచిపెట్టొద్దు. మా డిమాండ్లు రెండే. ఒకటి నిందితుడిని అరెస్ట్ చేయాలి. రెండోది అజయ్ మిశ్రను కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించాలి. ప్రభుత్వం ఇస్తున్న రూ.45 లక్షలతో న్యాయం జరుగదని, నిందితుడ్ని అరెస్ట్ చేసి శిక్షించడం ద్వారానే న్యాయం జరుగుతుంది.’ అని రాకేశ్ తికాయత్ లఖింపుర్ హాతీపూర్ గురుద్వారా గురుసింగ్ సభలో పేర్కొన్నారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
హర్మన్ప్రీత్సింగ్, గుర్జీత్కౌర్లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులు
సిక్కు పోలీసుకు హ్యూస్టన్ పోస్టాఫీస్ గౌరవం
పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సంక్షోభం తప్పదు : యూఎన్ హెచ్చరిక
తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
ఇండియన్ పీనల్ కోడ్ ఆమోదించి నేటికి 161 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..