Vasundhara Raje | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే (Vasundhara Raje) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Rajasthan Assembly Elections) జరగనున్న విషయం తెలిసిందే. మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ (Congress) పార్టీ పోరాడుతుంటే.. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కమలం (BJP) పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలూ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రంలో ఎన్నికల హీట్ పుట్టిస్తున్నాయి.
ఇక వసుంధరా రాజే మరోమారు ఝలావర్ (Jhalawar) నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో తన కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ ప్రసంగించిన తర్వాత రాజే మాట్లాడుతూ.. ఇక మీదట తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని అనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ‘నా కుమారుడు ప్రసంగం విన్న తర్వాత.. నేను ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని అనిపిస్తోంది. దుష్యంత్ పట్ల ప్రజలు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తున్నారు. ప్రజలు తనని సరైన మార్గంలోనే నడిపిస్తున్నారు. దుష్యంత్ సింగ్ గురించి నాకు ఇక ఎలాంటి బెంగా అవసరం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.
రాజస్థాన్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 25న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్లతోపాటు రాజస్థాన్ ఓట్లను కూడా లెక్కించనున్నారు.
Also Read..
Heavy rain | చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు
ODI World Cup 2023 | ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్న బంగ్లాదేశ్
Pakistan: ఎయిర్ఫోర్స్ బేస్పై దాడి.. ధ్వంసమైన 3 విమానాలు.. ముగ్గురు మిలిటెంట్లు హతం