ఇస్లామాబాద్: పాకిస్థాన్(Pakistan)లోని వైమానిక దళానికి చెందిన మియాన్వాలీ ట్రైనింగ్ ఎయిర్ బేస్పై ఉగ్రవాద దాడి జరిగింది. అయితే ఆ అటాక్ను తిప్పికొట్టారు. ముగ్గురు మిలిటెంట్లను పాక్ ఆర్మీ మట్టుబెట్టింది. మరో ముగ్గురు ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మూడు విమానాలు, ఫ్యూయల్ ట్యాంకర్ ధ్వంసమైనట్లు పాక్ మిలిటరీ పేర్కొన్నది. మిలిటెంట్లు ఎయిర్బేస్లోకి చొరబడిన వీడియోలు ప్రస్తుతం లీక్ అయ్యాయి.
ఉగ్రవాదుల దాడిలో భారీ నష్టమే జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎయిర్ బేస్కు ఎంటర్ అవుతున్న సమయంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని షూట్ చేశామని, మరో ముగ్గుర్ని కార్నర్ చేసినట్లు మిలిటరీ పేర్కొన్నది. దేశం నుంచి ఉగ్రవాదుల్ని రూపుమాపేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు పాక్ మిలిటరీ తెలిపింది.
శుక్రవారం రోజున ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలను టార్గెట్ చేశారు. రెండు వాహనాలపై జరిగిన దాడిలో.. 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గదార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మిలిటరీ కాన్వాయ్ పస్ని నుంచి ఒర్మారా వెళ్తున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. ఉగ్రదాడికి పాల్పడిన వారి కోసం అన్వేషిస్తున్నట్లు ఆర్మీ తెలిపింది.