చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ మంగళవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని అంతకు ముందు ట్వీట్ చేశారు.
దీనిపై అనిల్ విజ్ స్పందిస్తూ.. ఒకవేళ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి చికిత్స పొందడానికి ఢిల్లీలో అవకాశం లేకపోతే.. మెరుగైన చికిత్స కోసం బీజేపీ పాలనలో ఉన్న హర్యానాకు రావొచ్చు అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ పలు ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఆయనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలో ఆయనకు మెరుగైన చికిత్స లభించడం కష్టం అని భావిస్తే ఆయన హర్యానాకు రావొచ్చు. మేము ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తాం అని ఓ వార్తా సంస్థతో చెప్పారు.
అంతకుముందు మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ.. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేయాలని కేంద్రం రూపొందించిన ప్రణాళికపై స్పందించారు. ఇది పంపిణీ వ్యూహం కాదని వ్యాక్సిన్ వివక్ష అని వ్యాఖ్యానించారు. 18 నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సు గల వారికి ఉచితంగా వ్యాక్సిన్ లభించదు.. బలహీన వర్గాలకు వ్యాక్సినేషన్పై హామీ లేదని పేర్కొన్నారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు