లండన్ : బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి ఇచ్చేందుకు ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చర్యలు ప్రారంభించారు. మరోవైపు, పబ్బులు, రెస్టారెంట్లు జనంతో నిండిపోయాయి. పెద్ద ఎత్తున జనం బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తూ కనిపించారు. రోడ్లపై డ్యాన్సులు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒక్కరోజే 28 లక్షల లీటర్ల బీర్లు అమ్ముడుపోయాయంటే.. అక్కడి ప్రజలు మందు కోసం ఎంతగా ముఖం వాచి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
బ్రిటన్లో కరోనా కేసులు మెరుగుపడుతున్నాయి. ఈ దృష్ట్యా ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ లాక్డౌన్కు విశ్రాంతి ఇచ్చేందుకు నిర్ణయించారు. పబ్బులు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ మినహాయింపు ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇంగ్లండ్లో సూపర్ సాటర్డే నైట్ పేరుతో జరిగే ఈవెంట్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు బారులుతీరారు. ఒక్క రోజులో దాదాపు 30 లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారంట. ఈ కారణంగా, ఇంగ్లండ్లోని దాదాపు 50 వేల బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు కిక్కిరిసిపోయాయి. ఆ రోజున 6 మిలియన్ పాయింట్లు (దాదాపు 28 లక్షల లీటర్లు) బీరు అమ్ముడుపోయిందని గణాంకాలు చెప్తున్నాయి.
పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడంతో వైద్య నిపుణులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత మార్గదర్శకాలను పాటిస్తే బాగుంటుంది కానీ, లాక్డౌన్ విశ్రాంతి కాలంలో విచ్చలవిడితనంతో తిరిగితే మరింత ప్రమాదాన్ని కొనితెచ్చుకోవాల్స వస్తుందని వారు అంటున్నారు. రెస్టారెంట్లు, పబ్బులకు వెళ్తున్నవారు, వాటి యాజమాన్యాలు కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని వారు సూచిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందరి వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. చరిత్రలో ఈరోజు
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..