దమ్మపేట, జూలై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు దమ్మపేట మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికి తినిపించారు. అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు దొడ్డ రమేష్, దారా యుగంధర్, రావుల శ్రీను, అంకథ ఉమా మహేశ్వరరావు, దేవరాలపల్లి అజయ్ కుమార్, జలగం వాసు, అబ్దుల్ జిన్నా, మాజీ ఎంపీపీ సున్నం లలిత, గాజుబోయిన యేసుబాబు, యార్లగడ్డ శ్రీను, సర్పంచ్ యాట్ల రాందాస్, కొమరం సుశీల, తోగర్త అనిత, మాజీ సర్పంచ్ మొగిలి కృష్ణ, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు మెంబర్లు దారా రాము, బుడే, కాసిని శ్రీను, రెడ్డిమల్ల నాగయ్య, యలమంచి చంద్రశేఖర్, దండాబత్తుల కాంతారావు, మద్దెల పుల్లారావు, పాశం ప్రసాద్, వల్లేపు నాగేశ్వరరావు, గుడిపూడి రవి, గొర్రెపాటి వెంకటేశ్వరరావు, కౌలురి నాగయ్య, గుమ్మడపు విష్ణు, మండవ సత్య, మోరంపూడి జయప్రసాద్, కోర్స వెంకటేష్, వాసం పండు, కౌలురి ఏసు, వాడపల్లి ఆనంద రావు, బి.శ్రీను, గణేష్, సాయి, కందుకూరి రాంబాబు, సున్నం నరేంద్ర, గణేష్, అశోక్ పాల్గొన్నారు.

దమ్మపేటలో కేటీఆర్ జన్మదిన వేడుకలు.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు