న్యూఢిల్లీ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇండ్లకు తిరుగుముఖం పడుతున్న వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వలస కార్మికుల ఖాతాలను సేకరించి నగదు వేయాలని ఆయన సూచించారు. కొవిడ్-19 వ్యాప్తి పెరుగుతుండటంతో అమలు చేస్తున్న ఆంక్షలు, కఠినమైన చర్యలను అనుసరించి వలస కార్మికులు ఇండ్లకు తిరుగుముఖం పట్టడం ప్రారంభించారు.
‘వలస కూలీలు మరోసారి ఇండ్లకు వెళ్లిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు వేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అయితే కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం ప్రజలను నిందిస్తూ ప్రజా ప్రయోజనాల కోసం ఈ చర్య తీసుకుంటుందా?’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఢిల్లీలో అమలు చేసిన 6 రోజుల లాక్డౌన్ కారణంగా సోమవారం సాయంత్రం తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వందలాది మంది వలస కూలీలు ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ వద్ద గుమిగూడారు. దీంతో ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వలస కూలీల గుంపు ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా బస్స్టాప్లో గంటల కొద్ది వేచి ఉండాల్సి వచ్చింది.
ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా ఇన్ఫెక్షన్ను నివారించడానికి లాక్డౌన్, కర్ఫ్యూ వంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..