ప్రసిద్ధ శాస్త్రవేత్త మేడమ్ మెర్క్యూరీ.. తన భర్త పియరీ క్యూరీతో కలిసి పిచ్బ్లెండ్ అనే ఖనిజం నుంచి రేడియోధార్మిక పదార్థాలైన రేడియం, పోలోనియంలను 1902 లో సరిగ్గా ఇదేరోజున వేరు చేశారు. ఈ ఆవిష్కరణ శాస్త్రీయ ప్రపంచంలో కొత్త విప్లవాన్ని తెచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె వేరు చేసిచూపిన రేడియం క్యాన్సర్ వ్యాధి చికిత్సలో అత్యంత ఉపయోగకరంగా మారింది. ఎందరికో ప్రాణాలను పోస్టున్నది.
ఔషధాల్లో రేడియం వాడకం 19 వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఇది గామా కిరణాలను విడుదల చేస్తుంది. వీటిని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. అలాగే, రేడియం, బ్రోమిన్ సమ్మేళనాలు, రేడియం బ్రోమైడ్ కూడా ఔషధంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. రాడాన్ క్యాన్సర్ కోసం రేడియేషన్ థెరపీలో ఉపయోగిస్తారు. రాడాన్ రేడియం కరిగించడం ద్వారా ఉత్పత్తి అయ్యే వాయువు.
రేడియం ఆవిష్కరణ క్యూరీ దంపతులకు చాలా లాభదాయకమైన ఒప్పందంగా మారవచ్చు, కాని వారు మానవ సేవ కోసం రేడియంకు పేటెంట్ తీసుకోవడానికి నిరాకరించారు.
మెర్క్యూరీ పోలాండ్లోని వార్సా నగరంలో జన్మించారు. తన 11 ఏండ్ల వయసులోనే తల్లిని కోల్పోయింది. అనంతరం తదుపరి అధ్యయనాల కోసం పారిస్ వచ్చి అక్కడ పియరీ క్యూరీని కలుసుకున్నది. పియరీ క్యూరీ ఒక ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త. అతను మేరీకి తన ప్రయోగశాలలో పరిశోధకుడిగా పని చేయడానికి, ప్రయోగాలు చేయడానికి అవకాశం ఇచ్చాడు. కలిసి పనిచేసేటప్పుడు ఇద్దరూ ఒకరికొకరు దగ్గరికి వచ్చి.. 1895 జూలై 26 న వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఇద్దరూ తమ పరిశోధనలను కొనసాగించి సైన్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించారు.
మెర్క్యూరీ, పియరీ క్యూరీ 1902 ఏప్రిల్ 20 న పారిస్లోని తమ ప్రయోగశాలలోని ఖనిజం పిచ్బ్లెండ్ నుంచి రేడియం మరియు పోలోనియంను వేరు చేశారు. ఈ ఆవిష్కరణకు భౌతిక రంగంలో 1903 నోబెల్ బహుమతి పొందారు. రేడియం శుద్దీకరణకు మెర్క్యూరికి 1911 లో రెండవ నోబెల్ బహుమతి కూడా లభించింది.
1906 ఏప్రిల్ 19 న పారిస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పియరీ క్యూరీ మరణించారు. దీని తరువాత కూడా మెర్క్యూరీ తన పరిశోధనలో కొనసాగించారు. రేడియేషన్ మధ్య చాలా కాలం పనిచేస్తూ లుకేమియా అనే వ్యాధిని కనిపెట్టారు. ఈ గొప్ప శాస్త్రవేత్త 1934 జూలై 4 న కన్నుమూశారు.
2011: పీఎస్ఎల్వీ మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో
2006: మొదటి విదేశీ సైనిక స్థావరాన్ని తజికిస్థాన్లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన భారతదేశం
1970: గీత రచయిత, కవి షకీల్ బడౌని మరణం
1965: మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా జననం
1960: భారతదేశపు ప్రసిద్ధ ఫ్లూట్ వాద్యకారుడు పన్నలాల్ ఘోష్ మరణం
1950: తెలుగుదేశం పార్టీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జననం
1947: ప్రసిద్ధ చరిత్రకారుడు గౌరిశంకర్ హిరాచంద్ ఓజా మరణం
1920: అలబామా, ఎంసీపీసీలో తుఫాను కారణంగా 220 మంది దుర్మరణం
1889 : జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ జననం
1777: కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించి స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న న్యూయార్క్
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..