జూబ్లీహిల్స్,ఆగస్టు 1 : రహ్మత్నగర్లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. స్థానిక పోచమ్మ టెంపుల్, చర్చ్ లైన్లలో కలుషిత నీటి సరఫరాతో నెలరోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే మంచినీరు ఎక్కడ కలుషితమవుతుందో అర్థం కాని పరిస్థితి. రెండు నెలల కిందట ఇక్కడ నాలా నిర్మాణ పనుల కోసం తవ్వకాలు చేపట్టారు.
అప్పటికే అక్కడ నాలాలో ఉన్న వాటర్ పైప్లైన్ లీకేజీని గుర్తించి క్లాంప్లు బిగించారు. అయినా నీరు లీకేజీ అవుతున్నది. అయితే ఇక్కడ బాక్స్డ్రైన్ పనులు పూర్తికాకపోవడంతో ఈ నాలా ఓపెన్లోనే ఉండి పైప్లైన్ నాలాలో మునిగిపోకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ మురుగు నీరు కలవడం లేదు. అయితే మిగతా మ్యాన్హోల్స్, లేదా పైప్లైన్ డ్యామేజీలతో నీరు కలుషితమవుతుందా అన్నది గుర్తించాల్సి ఉంది.