KA Paul : ప్రజాశాంతి పార్టీ (Prajashanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేఏ పాల్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది. దాంతో పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police) ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేఏ పాల్ కంపెనీలో నైట్ షిఫ్టులో పని చేస్తున్న ఓ యువతిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలతో షీ టీమ్స్ను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సంబంధిత వాట్సాప్ మెసేజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.