Gold rate : పసిడి ధర (Gold price) పరుగులు తీస్తూనే ఉంది. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. దాంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ బంగారం ధర తులంపై ఏకంగా రూ.820 ఎక్కువైంది. బంగారంతోపాటు వెండి ధర (Silver price) కూడా చుక్కలు చూపిస్తోంది. కిలో వెండి ధర ఏకంగా రూ.2 వేలు పెరిగింది.
మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ. 1,02,220 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 పెరిగి రూ.93,700 వద్ద ట్రేడవుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,700కు చేరింది. అదే సమయంలో వెండి ధర కూడా పెరుగుతోంది. కిలో వెండి ధర ఏకంగా రూ.2 వేలు పెరిగి రూ.1,15,000 వద్ద ట్రేడవుతోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరు, దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర రాజధాని ముంబై, పశ్చిబెంగాల్ రాజధాని కోల్కతాలో కూడా బంగారం ధరలు ఇదేవిధంగా ఉన్నాయి. అయితే చెన్నైలో మాత్రం మరో రూ.10 వేల ఎక్కువ ధర ఉంది.