Bipin Rawat death | త్రివిధ దళాల అధిపతి సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న సూలూరు ఎయిర్బేస్ నుంచి కూనూరులోని కంటోన్మెంట్ ఏరియాకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ఐఏఎఫ్ చాపర్ కుప్పకూలింది. మరో ఐదు నిమిషాలు అయితే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందన్న సమయంలో ఒక్కసారిగా హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. విల్లింగ్టన్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశారు. ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ సహా గతంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఎవరు ఎవరు మరణించారో ఒకసారి చూద్దాం..
హెలికాప్టర్ ప్రమాదం అంటే ముందుగా గుర్తొచ్చేది దివంగత నేత, ఉమ్మడి అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం. 2009 సెప్టెంబర్ 3న పావురాల గుట్ట వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ బయల్దేరిన కాసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతైంది. కనిపించకుండా పోయిన హెలికాప్టర్ కోసం దాదాపు 24 గంటల పాటు వెతికితే.. చివరకు పావురాల గుట్ట వద్ద కుప్పకూలినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో వైఎస్ఆర్తో పాటు మరో ఐదుగురు సిబ్బంది మరణించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావు సింథియా విమాన ప్రమాదంలో మరణించారు. 2001 సెప్టెంబర్లో యూపీలోని బహిరంగ సభలో పాల్గొనేందుకు కాన్పూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్పూర్కు 172కిలోమీటర్ల దూరంలోని మెయిన్పురి శివార్లలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో సింథియాతో పాటు మరో ఆరుగురు మరణించారు.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ కూడా ఢిల్లీ సమీపంలో జరిగిన ఎయిర్ క్రాష్లో మరణించారు. 1980 జూన్ 23న ఆయన ప్రయాణిస్తున్న తేలికపాటి హెలికాప్టర్ గ్లైడర్.. ఢిల్లీ సఫ్దర్జంగ్ విమానశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సంజయ్ గాంధీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కన్నుమూశారు. 2002 మార్చి 3న భీమవరం నుంచి తిరిగివస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ ఒక కొబ్బరి చెట్టును ఢీకొని పక్కనే ఉన్న చేపల చెరువులో పడింది.
నటి సౌందర్య కూడా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2004 ఏప్రిల్ 17న బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో సౌందర్య సజీవ దహనం అవ్వగా.. ఆమె సోదరుడు అమరనాథ్ ప్రాణాలతో బయటపడ్డారు.
1973 మే 31 జరిగిన విమాన ప్రమాదంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ మోహన్ కుమార మంగళం దుర్మరణం చెందారు. ఆ దుర్ఘటనలో మృతదేహాలు అన్ని చెదిరిపోయాయి. అయితే కుమారమంగళం ఉపయోగించే పార్కర్ పెన్, వినికిడి యంత్రం సహాయంతో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ధోర్జీ ఖండూ 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ధోర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లోబో తాండ్ వద్ద కూలింది. ఈ ప్రమాదంలో ధోర్జీ సహా ఐదుగురు మృతిచెందారు.
జిందాల్ స్టీల్స్ అధినేత ఓం ప్రకాశ్ జిందాల్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలోనే మరణించారు. యూపీలోని సహారన్పూర్లో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CDS BipinRawat | రావత్ భార్య మధులిక మృతి.. ముద్దముద్దలుగా మృతదేహాలు
Bipin Rawat death | గతంలో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ రావత్
IAF Helicopter crash: కాలిపోతున్న హెలిక్యాప్టర్ నుంచి మృతదేహాలు పడటం చూశా..!
Bipin Rawat | బిపిన్ రావత్ కూనూరు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే..?
IAF Helicopter crash | తునాతునకలైన హెలికాప్టర్.. కాలిబూడిదైన భారీ వృక్షాలు.. వీడియో
CDS Bipin Rawat | జీవాయుధ యుద్ధం గురించి నిన్ననే వార్నింగ్ ఇచ్చిన బిపిన్ రావత్..
IAF chopper crash | వెదర్ బ్రీఫింగ్ తర్వాతే ఎగిరిన రావత్ హెలికాప్టర్ !