న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మంగళవారమే ఓ వార్నింగ్ ఇచ్చారు. జీవాయుధ పోరాటానికి సన్నద్దంగా ఉండాలన్నారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు.. రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో రావత్కు ఏం జరిగిందన్న దానిపై ఇంక్లా క్లారిటీ రాలేదు. మంగళవారం ప్యానెక్స్-21 ప్రారంభోత్స ఈవెంట్లో పాల్గొన్న త్రివిధదళాధిపతి రావత్ మాట్లాడుతూ.. ఓ కొత్త విషయాన్ని హైలెట్ చేయాలనుకున్నానని, కొత్త తరహా యుద్ధానికి సన్నద్దం కావాలని, ఒకవేళ జీవాయుధ పోరాటాలు ప్రారంభం అవుతున్నట్లు గమనిస్తే, అప్పుడు మరో దానికి తగినట్లు బలోపేతం కావాలన్నారు. వైరస్లు, వ్యాధులు తట్టుకునే రీతిలో మన దేశం ప్రిపేర్ కావాలని సీడీఎస్ రావత్ తెలిపారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని, భవిష్యత్తులో వైరస్లను ఎదుర్కొనేందుకు సమాయత్తమై ఉండాలన్నారు. ఏ దేశంలోనైనా ఇలాంటి సమస్య వస్తే, అప్పుడు ఒకర్ని ఒకరు ఆదుకోవాలన్నారు.