న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనురు వద్ద ఇవాళ ఆర్మీ హెలికాప్టర్ కూలిన విషయం తెలిసిందే. ఆ హెలికాప్టర్లో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ దంపతులు ఉన్నారు. అయితే వెదర్ బ్రీఫింగ్ తర్వాత హెలికాప్టర్ ఎగిరినట్లు అధికారులు చెబుతున్నారు. వెదర్ బ్రీఫింగ్ సమయంలో ఆ ప్రదేశంలో ఉండే విండ్ స్పీడ్తో పాటు ఇతర వాతావరణ పరిస్థితుల గురించి పైలెట్కు వివరిస్తారు. మిషన్ అబ్జెక్ట్ కూడా వెల్లడిస్తారు. క్లియరెన్స్ కోసం చాలా స్ట్రిక్ట్గా ప్రొసీజర్ ఫాలో అవుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి కుట్ర ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం గురించి 1.53 నిమిషాలకు వాయుసేన తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఎంఐ 17 హెలికాప్టర్ ను చాన్నాళ్ల నుంచి వైమానిక రక్షణ దళం ఉంది. వీ5 వర్షెన్ చాలా అత్యాధునికమైంది. ఈ వేరియంట్ హెలికాప్టర్తో ప్రమాదాలు కూడా చాలా తక్కువగా జరిగాయి. రాత్రిపూట కూడా ఈ హెలికాప్టర్ గాలిలో ఎగురుతుంది. హెలికాప్టర్పై డౌట్ చెందాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. హెలికాప్టర్లో 14 మంది ఉన్నారు. వారిలో 9 మంది ప్రయాణికులు, మిగితావానంతా సిబ్బంది అని తెలుస్తోంది.