చెన్నై : తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఆర్మీ హెలికాప్టర్ తునాతునకలైంది. భారీ ప్రమాదానికి అక్కడున్న భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. వృక్షాలు కూడా పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. హెలికాప్టర్ భాగాలు ముద్దగా మారాయి. అసలు ఏ భాగం ఎక్కడుందో కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. కోయంబత్తూరు – కూనూరు మధ్య ఈ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.