జడ్చర్ల, ఆగస్టు 8 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూర్గుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శశిధర్ సస్పెండ్ అయ్యాడు. పంచాయతీ నిధులు రూ.20 లక్షలకుపైగా దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిసింది.
అదీగాక ఇంటి పన్నుల వసూలులో దుర్వినియోగం, రికార్డులను సక్రమంగా నిర్వహించలేదంటూ డీఎల్పీవో అందించిన విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ కుష్బూ గుప్తా కార్యదర్శి శశిధర్ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.