చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర ఖజగం (ఏఐఏడీఎంకే) ఒకప్పటి అధినేత్రి, స్వర్గీయ జయలలితకు నెచ్చెలి అయిన శశికళ ఇవాళ రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. శశికళతోపాటు ఆమె అభిమానులు, సన్నిహితులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, జయలలిత మరణానంతరం ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో జైలుకు వెళ్లిన శశికళ ఇటీవలే బెయిల్పై జైలు నుంచి బయటికి వచ్చారు. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా రాజకీయాల గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. కాగా, ఇటీవల తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం మాత్రం శశికళ అన్నాడీఎంకేలో చేరుతానంటే పరిశీలిస్తామని చెప్పారు. కానీ శశికళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
శరద్పవార్కు స్వల్ప అస్వస్థత.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలింపు
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి..!
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు
లండన్లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?