Election body | లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేసే ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రచారాల్లో (campaigning) కుల, మత ప్రస్తావనలు తీసుకురావడంపై మండిపడింది. ఈ మేరకు అధికార బీజేపీ (BJP), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ (Congress) పార్టీలకు బుధవారం నోటీసులు ఇచ్చింది.
అగ్ర నేతలు, క్యాంపెయినర్లు చేసే ప్రసంగాలు గాడి తప్పుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా తమ స్టార్ క్యాంపెయినర్లు ప్రచార శైలిని మార్చుకోవాలని కోరింది. ఈ మేరకు రెండు పార్టీల జాతీయ అధ్యక్షులకు పోల్ బాడీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారాల్లో మతపరమైన (caste, community) అంశాలకు దూరంగా ఉండాలని నోటీసుల్లో ఆదేశించింది. సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలను వెంటనే ఆపాలని బీజేపీకి సూచించింది. అదేవిధంగా రాజ్యాంగం రద్దవుతుందనే తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని ఎన్నికల సంఘం ఆదేశించింది.
Also Read..
Manisha Koirala | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ని కలిసిన మనీషా కోయిరాల.. ఫొటోలు షేర్ చేసిన నటి
Schengen Visa | షెన్జెన్ వీసా ఫీజు 12 శాతం పెంపు.. భారతీయులపై తీవ్ర ప్రభావం